Telugu Gateway
Politics

ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు..ఢిల్లీలో కలకలం

ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు..ఢిల్లీలో కలకలం
X

ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని దక్కించుకుని కుషీకుషీలో ఉంది. కానీ అంతలోనే అనుకోని ఘటన. ఏకంగా ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పుల కలకలం. ఈ వ్యవహారం ఢిల్లీలో దుమారం రేపింది. ఆప్ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందారు. మరో కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై ఆప్‌ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడతూ.. ‘ఈ ఘటన జరగటం చాలా దురదృష్టకరం. ఈ దాడి ఎందుకు జరిగిందో నాకు తెలియదు. నాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఆ దుండగుడిని గుర్తించి పట్టుకోవాలి’ అని ఆయన అన్నారు. నరేష్‌ యాదవ్‌ మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలుపు ఆనందంలో ఉన్న ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు జరగటం చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it