Telugu Gateway
Andhra Pradesh

బాలకృష్ణ హిందూపురం పర్యటనలో ఉద్రిక్తత

బాలకృష్ణ హిందూపురం పర్యటనలో ఉద్రిక్తత
X

తెలుగుదేశం ఎమ్మెల్యే, సినిమా హీరో నందమూరి బాలకృష్ణకు హిందుపురంలో చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో ఆయన పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మూడు రాజధానులను వ్యతిరేకించినందుకు రాయలసీమ ద్రోహి..బాలకృష్ణ గో బ్యాక్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ మేరకు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి బాలకృష్ణ కాన్వాయ్ ను ముందుకు వెళ్ళేలా చేశారు. బాలకృష్ణ పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ప్రదర్శనలు చేస్తుందని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఓ వైపు వైసీపీ కార్యకర్తలకు బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే..మరో వైపు టీడీపీ కార్యకర్తలు జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితి ఉండటంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

Next Story
Share it