Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డికి షాక్

రేవంత్  రెడ్డికి షాక్
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గ ప్రజలు మరోసారి షాక్ ఇచ్చారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తాను కొడంగల్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదని..ప్రజలు నెమ్మదిగా వాస్తవాలు తెలుసుకుంటారని వేచిచూస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తాము అయితే ఏదేదో చేస్తామని హామీ ఇచ్చిన అధికార పార్టీ నేతలు ఏమి చేశారని ఘాటుగా ప్రశ్నించారు. ఇవేమీ ఫలితాలను ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో మరోసారి రేవంత్ కు కొడంగల్ లో షాక్ తగిలినట్లు అయింది. ఈ నియోజకవర్గంలో ఆయన మరోసారి వెనకబడ్డారు.

12 వార్డులకు గాను టీఆర్ఎస్ 8 వార్డులను సొంతం చేసుకుంది. మూడింటిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ విస్తృతంగా తిరిగినా.. ఎక్కువ ప్రభావం చూపలేకపోయారు. టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించి తమ పట్టు దక్కలేదని నిరూపించుకుంది. గతంలో రేవంత్ రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

Next Story
Share it