‘సరిలేరు నీకెవ్వరు’ సెన్సార్ పూర్తి
సంక్రాంతి సందడికి రంగం సిద్ధం అయింది. ఈ సంక్రాంతికి రెండు భారీ సినిమాలు బరిలో నిలిచాయి. అందులో ఒకటైన ‘సరిలేరు నీకెవ్వరు’ గురువారం నాడు సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. మహేష్ బాబు, రష్మిక మందనలు జంటగా నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కామెడీతో పాటు సీరియస్ అంశాలు సమ్మిళతమై ఉంటాయని చెబుతున్నారు.
మహేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో బ్లాక్బస్టర్ హిట్గా ‘సరిలేరు నీకెవ్వరు’ నిలవడం ఖామయని జోస్యం చెబుతోంది చిత్ర యూనిట్. ఈ చిత్రంతో టాలీవుడ్ లేడీ సూపర్స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, కౌముది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. అనిల్ సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్బాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.