Telugu Gateway
Politics

వైసీపీ నేత హత్యకు కుట్ర

వైసీపీ నేత హత్యకు కుట్ర
X

శ్రీకాకుళంలో కలకలం. అధికార వైసీపీ నేత హత్యకు కుట్ర పన్నిన వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు చిరంజీవి హత్య కుట్రను విశాఖ పోలీసులు భగ్నం చేశారు. ఈ హత్య కుట్రలో టీడీపీ ఎంపీటీసీ అమ్మినాయుడు ప్రధాన నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు. రాజకీయంగా అడ్డు వస్తున్నాడనే కక్షతో చిరంజీవి హత్యకు అమ్మినాయుడు కుట్ర పన్నటంతోపాటు విశాఖకు చెందిన రౌడీషీటర్ కన్నబాబుకు సుపారీ ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్ధిని అంతమొందించాలనే కుట్రతో టీడీపీ నేత అమ్మినాయుడు సుపారీ గ్యాంగ్ తో 50 లక్షలకి డీల్‌ కుదుర్చుకున్నారని.. అడ్వాన్స్ గా 4 లక్షలు చెల్లించారని విశాఖ సీపీ ఆర్‌కే మీనా తెలిపారు.

సుపారీ గ్యాంగ్ లో ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మూడు కత్తులు, ఆరు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రెండు సార్లు రెక్కీ నిర్వహించడంతో పాటు చిరంజీవి హత్యకు ప్రయత్నించి విఫలమయ్యారని.. ఇదే సమయంలో తమకు వచ్చిన సమాచారం మేరకు సుపారీ గ్యాంగ్ లో ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితుడు అమ్మి నాయుడుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందని సీపీ ఆర్‌కే మీనా తెలిపారు.

Next Story
Share it