తెలంగాణలో పిరమల్ పెట్టుబడులు
BY Telugu Gateway22 Jan 2020 4:34 PM IST

X
Telugu Gateway22 Jan 2020 4:34 PM IST
తెలంగాణ ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ దావోస్ పర్యటన రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురాబోతోంది. ఫార్మా రంగంలోని ప్రముఖ సంస్థ పిరమల్ గ్రూప్ తెలంగాణలో తన ప్రాజెక్టును మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించటానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో ప్రత్యక్ష 600 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడితో అవకాశం కలుగుతుంది.
వచ్చే నెల తెలంగాణలో పర్యటించనున్న పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం. ప్రస్తుతం దావోస్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తో సమావేశం అయిన పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ ఈ అంశంపై చర్చించారు. ఈ చర్చల్లోనే పెట్టుబడి నిర్ణయం తీసుకున్నారు.
Next Story



