రాపాకకు పవన్ లేఖ..ఆ బిల్లులను వ్యతిరేకంచండి
BY Telugu Gateway20 Jan 2020 7:31 AM GMT
X
Telugu Gateway20 Jan 2020 7:31 AM GMT
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జనసేన వివిధ స్థాయిల్లో చర్చించి అమరావతిలోనే రాజదానిని కొనసాగించాలని నిర్ణయించినందున అసెంబ్లీలో సర్కారు పెట్టే బిల్లును వ్యతిరేకించాలని ఆయన తన లేఖలో పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని, అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. మూడు రాజదానుల అంశంపై ఓటింగ్ జరిగితే తాను అనుకూలంగా ఓటు వేస్తానని రాపాక తాజాగా బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లేఖ రాయటం ఆసక్తికర పరిణామంగా మారింది.
Next Story