Telugu Gateway
Andhra Pradesh

జనసేన, బిజెపిల మధ్య విస్తృత చర్చలు

జనసేన, బిజెపిల మధ్య విస్తృత చర్చలు
X

బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు బిజెపి, జనసేనల చర్చకు సంబంధించిన అంశాలపై ఆయన క్లారిటీ ఇఛ్చారు. తమ భేటీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు, అమరావతి అంశంపై మాత్రమే కాదని, అంత కంటే విస్తృత స్థాయిలో ఈ చర్చలు ఉంటాయని జీవీఎల్ వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లు తాము కలసి పనిచేయాల్సిన అంశాలపై కూడా మాట్లాడుకుంటామని తెలిపారు. 2024 ఎన్నికల వరకూ తమ వ్యూహన్ని ఖరారు చేసుకుంటామని తెలిపారు. గురువారం నాడు విజయవాడలో జనసేన-బిజెపి నేతల కీలక సమావేశం జరగనుంది.

ఈ భేటీ అనంతరం ఇరు పార్టీల నేతలు సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు. జనసేన తరపున చర్చల్లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు పాల్గొంటుండగా, బిజెపి తరపున ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఆ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. జనసేనతో చర్చలకు ముందు బిజెపి కీలక నేతలు అందరూ సమావేశం అయి జనసేనతో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు.

Next Story
Share it