Telugu Gateway
Andhra Pradesh

ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదు

ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదు
X

మండలి రద్దు వ్యవహారంపై తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా వేదిక కూల్చివేసినంత ఈజీ కాదు..మండలి రద్దు అని కౌన్సిల్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగకపోవటంతో వైసీపీలో మరింత కసి పెరిగిందని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ఏకపక్షంగా రద్దు చేయటం అంత సులభం కాదన్నారు.

ఏడాదిలోనే మండలిలో వైసీపీ సభ్యులే మెజారిటీ ఉంటారని..అలాంటప్పుడు మండలి రద్దు చేయాల్సిన అవసరం ఏముందని యనమల ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానం చేసినా మండలి వెంటనే రద్దు కాదన్నారు. ఇది అమల్లోకి రావటానికి కనీసం రెండు, మూడేళ్ల సమయం పడుతుందని తెలిపారు. ఈ లోగానే మండలిలో వైసీపీ సంఖ్యా బలం పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it