Telugu Gateway
Andhra Pradesh

టీవీ9పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

టీవీ9పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
X

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు టీవీ9పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ ఛానల్ ఓనర్ కు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అందుకే ఆయన అమరావతిని తేలిగ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను ఆ ఛానల్ లో ‘పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటారా?. బిర్యానీల కోసం వచ్చారని చూపిస్తారా?.’ ఇలా ఇష్టానుసారం చూపించే అధికారం మీకు ఎవరు ఇఛ్చారు?. అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతిని చంపేస్తే హైదరాబాద్ లో వాళ్ళ రియల్ ఎస్టేట్ కు లాభం అని వ్యాఖ్యానించారు.

అయితే చంద్రబాబు ఛానల్ పేరు నేరుగా ప్రస్తావించకుండానే ఈ విమర్శలు చేశారు. కొద్ది రోజుల క్రితమే టీవీ9 ఛానల్ లో మైహోంకు చెందిన రామేశ్వరరావు మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమరావతిలో టీవీ9 మహిళా రిపోర్టర్ పై దాడి జరగటంతో పాటు ఆ ఛానల్ కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. టీవీ9తోపాటు మరికొన్ని ఛానళ్ళ ప్రతినిధులకు కూడా దాడిలో గాయాలు అయ్యాయి.ఆడబిడ్డలను పెయిడ్ ఆర్టిస్ట్‌ లని మాట్లాడుతూ.. అవమానించిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

Next Story
Share it