స్టాలిన్ కు కేంద్రం షాక్
BY Telugu Gateway9 Jan 2020 8:43 PM IST
X
Telugu Gateway9 Jan 2020 8:43 PM IST
డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ కు కేంద్రం షాకిచ్చింది. స్టాలిన్ తో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ నేతలిద్దరికీ కేంద్రం విఐపి భధ్రతను తొలగించింది. వారికి ఇకపై కేంద్ర బలగాల రక్షణ ఉండబోదని గురువారం అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వంకు వై ప్లస్ కేటగిరి, స్టాలిన్కు జెడ్ ప్లస్ కేటగిరిల రక్షణ ఉంది.
ఇటీవల నాయకులకు ఉన్న ముప్పుపై సమీక్ష చేపట్టిన కేంద్ర భద్రతా సంస్థలు.. ఈ ఇద్దరు నేతల పేర్లను కేంద్ర భద్రత జాబితా నుంచి తొలగించాయి. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. అయితే రాష్ట్ర పోలీసులు పన్నీర్ సెల్వం, స్టాలిన్ల సెక్యూరిటీ బాధ్యతలు చేపట్టాక.. కేంద్రం నుంచి అధికారికంగా భద్రతను ఉపసంహరించుకుంటామని అధికారులు తెలిపారు.
Next Story