దిశా ఘటనపై కెసీఆర్ స్పందన మూడు రోజులకా?
BY Telugu Gateway2 Dec 2019 1:15 PM IST
X
Telugu Gateway2 Dec 2019 1:15 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం వచ్చిన రోజు ఆగమేఘాలపై విలేకరుల సమావేశం పెట్టిన కెసీఆర్ కు దేశాన్ని కదిలించిన దిశా ఘటనపై స్పందించడానికి మూడు రోజులు పట్టిందా? అని విజయశాంతి ప్రశ్నించారు. జాతీయ మీడియా ప్రశ్నించిన తరువాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పేరుతో చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల పై ఎలాంటి చర్యలు ఉంటాయో లేదో చెప్పలేదన్నారు.
ఆర్టీసీని ఆదుకుంటామని చెప్పిన సీఎం..హైకోర్టు తీర్పు వచ్చిన్నప్పుడు ఎందుకు ఈ పని చేయలేదన్నారు. ఆర్టీసీని కాపాడే నాధుడే లేడు అన్న కేసీఆర్ కు ఈ నిర్ణయాలు తీసుకోవటానికి రెండు సమయం పట్టిందా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో పెంపుడు కుక్కలకు ఇచ్చే విలువ తెలంగాణ సమాజానికి ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.
Next Story