Telugu Gateway
Cinema

బాహుబలి నిర్మాతల నుంచి కొత్త సినిమా

బాహుబలి నిర్మాతల నుంచి కొత్త సినిమా
X

బాహుబలి సినిమా రెండు భాగాలు దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. అలాంటి సినిమాలను తెరకెక్కించిన సంస్థ ఆర్కా మీడియా. ఆ సంస్థ ఇఫ్పుడు కొత్త సినిమాను ప్రకటించింది. అదేంటి అంటే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. టైటిల్ పేరు చూసి ఇదేమీ సినిమా అనుకునే పరిస్థితి. నిర్మాతలు బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమా తెరకెక్కించిన వారు అయితే..ఈ సినిమా దర్శకుడు కూడా అంతే సంచలనం సృష్టించిన వ్యక్తి కావటం మరో విశేషం. ఆయనే కెరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహ. ఈ సినిమా కూడా ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాకు సంబంధించిన వివరాలతో చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ‘చెప్పు లేసుకోవయ్యా అంటే.. తిరిగి ఆణ్ణి కొట్టేవరకు చెప్పులు వేసుకోను’ అంటూ హీరో సమాధానం ఇస్తాడు. ప్రతీకారం నేపథ్యంలో కథ నడుస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ సినిమాను 2020, ఏప్రిల్‌ 17న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

https://www.youtube.com/watch?v=CIgiv-nEnK0&feature=emb_logo

Next Story
Share it