Telugu Gateway
Andhra Pradesh

వచ్చే ఎన్నికల్లో పోటీ వైసీపీ..బిజెపి మధ్యే

వచ్చే ఎన్నికల్లో పోటీ వైసీపీ..బిజెపి మధ్యే
X

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభం అయ్యాయి. లాబీల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ వైసీపీ, బిజెపిల మధ్యే ఉంటుందని అన్నారు. సీఎం జగన్ వల్లే టీడీపీకి ఇంకా ప్రతిపక్ష హోదా కొనసాగుతోందని తెలిపారు. శాసన సభ్యత్వానికి ఇబ్బంది లేదని జగన్ హామీ ఇస్తే 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీది మూడో స్థానానికి పడిపోతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.

ఆనం కామెంట్లపై తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, తన అభిప్రాయాలను పార్టీ వేదికల మీదే వినిపిస్తానని తెలిపారు. ఆనం వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు స్పందించారు. కోటం రెడ్డి ఆలోచించాల్సింది టీడీపీ ఎమ్మెల గురించి కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి అని ఎద్దేవా చేశారు. అసంతృప్తితో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ- టీడీపీల్లో చేరడానికి సిద్దంగా ఉన్నారు. ఆనం వ్యాఖ్యల వెనుకున్న అర్ధమేంటో కోటంరెడ్డి చెప్పాలి. మాఫియాలా తయారయ్యారని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలే అంటున్నారని సత్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు.

Next Story
Share it