Telugu Gateway
Andhra Pradesh

అమరావతి గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన

అమరావతి గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. రాజధాని కోసం తాము భూములు ఇచ్చినందున ఇక్కడే అమరావతిని అభివృద్ధి చేయాలని కోరుతూ రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు రాజదాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు జనసేన తెలిపింది.

వైసీపీ ప్రభుత్వం ఈ భూముల్లో కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి ఆసక్తి చూపటం లేదు. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖపట్నానికి తరలించాలని ప్రతిపాదించారు. అమరావతిలో కొత్తగా చేపట్టే నిర్మాణాలు కూడా మంగళగిరి మార్గంలో హైవేకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల్లోనే చేపట్టనున్నారు.. ఈ తరుణంలో భూములు ఇచ్చిన రైతులు పరిస్థితి ఏంటి?. వారిని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది అనే అంశంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Next Story
Share it