Telugu Gateway
Cinema

మహేష్ బాబుతో ఫోటోల కోసం ఫ్యాన్స్ రచ్చ

మహేష్ బాబుతో ఫోటోల కోసం ఫ్యాన్స్ రచ్చ
X

ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన హీరో మహేష్ బాబుతో ఫోటోల కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. తమ అభిమాన హీరోతో పోటోలు దిగేందుకు భారీ ఎత్తున రావటంతో వారిని నియంత్రించటం కష్టం అయిపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతో తొక్కిసలాటలో కొంత మంది అభిమానులకు గాయాలు కూడా అయ్యాయి.

విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహకులపై కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ఫోటో షూట్ కార్యక్రమం రసాభాస కావటంతో మహేష్ బాబు కూడా అక్కడ నుంచి మధ్యలోనే వెళ్ళిపోయారు. ఈ సినిమా షూటింగ్ జరిగిన అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఈ కార్యక్రమం చేపట్టారు.

Next Story
Share it