Telugu Gateway
Andhra Pradesh

ఇదేనా ప్రతిపక్ష నేత వ్యవహరించే తీరు?

ఇదేనా ప్రతిపక్ష నేత వ్యవహరించే తీరు?
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదేనా ప్రతిపక్ష నేత వ్యవహరించే తీరు అని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు అయిన మార్షల్స్‌ పై టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని జగన్ తప్పుబట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించారన్నదానికి ఈ ఘటన నిదర్శమని తెలిపారు. టీడీపీ సభ్యుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. వీడియో ప్రదర్శన అనంతరం జగన్ మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను సభలోకి ప్రవేశించాల్సిన గేటు అసలు అది కాదు. ఆయన గేటు నెంబర్‌ 2 నుంచి సభలోకి రావాల్సి ఉంది. కానీ అందరితో కలిసి ఆందోళన చేయాలని చంద్రబాబు చూశారు. ప్రోటోకాల్‌ ప్రకారం సభ్యులను మాత్రమే లోనికి పంపేందుకు మార్షల్స్‌ ప్రయత్నించడం. కానీ చంద్రబాబు నాయుడు మార్షల్స్‌ ను బాస్టడ్‌ అని దూషించడం దారుణం. లోకేశ్‌ చీఫ్‌ మార్షల్స్‌ను యూజ్‌లెస్‌ అంటూ తిట్టారు.

ఉద్యోగుస్తులను అనరాని మాటలు అన్నార’ని తెలిపారు. టీడీపీ సభ్యులు అధికారులు గొంతు పట్టుకుని దౌర్జన్యానికి దిగారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న అధికారులను పిలిచి మాట్లాడినట్టు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలోని రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సభ్యుల రక్షణ కోసమే మార్షల్స్‌ ఉన్నారని గుర్తుచేశారు. అలాంటిది మార్షల్స్‌ ను టీడీపీ సభ్యులు దుర్భాషలాడారని సభ దృష్టికి మరోసారి తీసుకువచ్చారు. నిన్నటి ఘటనపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరగలేదని గుర్తుచేశారు. చీఫ్‌ మార్షల్స్‌ ను ఇంత దారుణంగా తిడతారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇంత జరిగినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదని అన్నారు. చంద్రబాబు తన మాటలను ఉపసంహరించుకోని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Next Story
Share it