ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం
BY Telugu Gateway11 Dec 2019 10:19 AM IST

X
Telugu Gateway11 Dec 2019 10:19 AM IST
ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా...ఆ ప్రాంతంలో డ్రోన్ ఒకటి కలకలం రేపింది. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తోపాటు దీపక్ రెడ్డి, అశోక్ బాబులు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో డ్రోన్ ఆకస్మాత్తుగా వారు వెళుతున్న ప్రాంతంలో కింద పడింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే విద్యుత్ తీగలు తగిలి డ్రోన్ కింద పడినట్లు గుర్తించారు. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కింద పడిందని గుర్తించిన సిబ్బంది...సత్వరమే రంగంలోకి దిగి దాన్ని అక్కడ నుంచి తీసుకెళ్ళారు.
Next Story