Telugu Gateway
Andhra Pradesh

ఏపీ రాజధానిపై సుజనా..సీఎం రమేష్ చెరోదారి

ఏపీ రాజధానిపై సుజనా..సీఎం రమేష్ చెరోదారి
X

‘అమరావతిని తరలిస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు. ఇదీ బిజెపి ఎంపీ సుజనా చౌదరి మాట. కేంద్రం రాజధానిపై సూచనలు చేస్తుందే తప్ప..అందులో జోక్యం చేసుకోదు. ఇది మరో బిజెపి ఎంపీ సీఎం రమేష్ తాజా కామెంట్. ఇద్దరు బిజెపి ఎంపీలు కేంద్ర జోక్యం విషయంలో తలోదారిలో ఉన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. అయితే అమరావతి నుంచి రాజధాని మార్పును బిజెపి వ్యతిరేకిస్తుందని తెలిపారు.

ఏపీ బిజెపి నేతలు రాజధాని విషయంలో తలో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారు. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నానికి అత్యంత కీలకమైన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను తరలించింది. కమిటీల పేరుతో ప్రస్తుతం ఓ వ్యవహారం సాగుతున్నా ఇది అంతా నామమాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజధాని కోసం వేల ఎకరాల భూములు ఇఛ్చిన రైతుల విషయంలో వైసీపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Next Story
Share it