వైసీపీలో చేరిన బీద మస్తాన్రావు
BY Telugu Gateway7 Dec 2019 8:29 AM GMT
X
Telugu Gateway7 Dec 2019 8:29 AM GMT
టీడీపీకి గుడ్ బై చెప్పిన నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీలో చేరిన తర్వాత బీద మస్తాన్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. అనతి కాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు.
Next Story