Telugu Gateway
Politics

‘ఆప్’కూ ప్రశాంత్ కిషోర్ సేవలు

‘ఆప్’కూ ప్రశాంత్ కిషోర్ సేవలు
X

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు పొందనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. ‘‘ఇండియా ఐప్యాక్ (ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ అడ్వైసరీ సంస్థ)తో పని చేయబోతున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నాం.

మీకు ఇదే మా సాదర స్వాగతం’’ అని అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ప్రశాంత్ కిషోరే వ్యూహాలు రచించారు. అనంతరం బీహార్ ఎన్నికల్లో మహా కూటమి గెలుపులో కూడా ఐప్యాక్ కృషి ఉంది. అంతే కాకుండా 2019లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి ఆ పార్టీని విజయ తీరాల్లో నిలిపారు. స్వయంగా జగన్ ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుందని పార్టీ ప్లీనరీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it