Telugu Gateway
Politics

‘రామ మందిరం’పై అమిత్ షా సంచలన ప్రకటన

‘రామ మందిరం’పై అమిత్ షా సంచలన ప్రకటన
X

అయోధ్య రామమందిరంపై బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. నాలుగు నెలల్లో అయోధ్య రామమందిరం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు తేలిపోవటంతో అయోధ్య రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం అయిందని చెప్పారు. ఆకాశాన్ని తాకేలా రామ మందిర నిర్మాణం సాగుతుందని తెలిపారు. ఇది దేశంలో కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు.జార్ఖండ్ బహిరంగ సభలో మాట్లాడుతూ అమిత్ షా ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అయోధ్య రామమందిరం రాకుండా అడ్డుకునేందుకు పలు ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

ఆ పార్టీకి చెందిన కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో ఈ మేరకు వాదనలు విన్పించారని అన్నారు. రామమందిరం నిర్మిస్తే మీ కడుపులో మంట ఎందుకు అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటీషన్లు దాఖలు కాగా..వీటిని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.

Next Story
Share it