Telugu Gateway
Politics

పవార్ కు ఉప ముఖ్యమంత్రి..ఆదిత్యకు మంత్రి

పవార్ కు ఉప ముఖ్యమంత్రి..ఆదిత్యకు మంత్రి
X

మరోసారి అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆయన బిజెపి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఆ పార్టీకి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ ఎన్సీపీని వీడటం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తర్వాత ఆయన కుటుంబ పెద్దల కోరిక మేరకు సొంత గూటికి చేరుకున్నారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం నాడు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఊహించినట్లుగానే అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది.

అదే సమయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే మంత్రి పదవి దక్కించుకున్నారు. బిజెపితో సయోధ్య సాగిఉంటే ఆదిత్య కొంత కాలం ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ ఎన్నికల ముందు కలసి పోటీచేసిన బిజెపి, శివసేనల మధ్య పదవుల పంపకం విషయంలో ముఖ్యంగా సీఎం పదవి విషయంలో పీఠముడి ఏర్పడి రెండూ విడిపోయిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని పార్టీల తరపున కలుపుకుని సోమవారం నాడు కొత్తగా 35 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story
Share it