Telugu Gateway
Politics

రెండు వారాల్లో ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలి

రెండు వారాల్లో ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలి
X

కార్మిక శాఖ కమిషనర్ పరిధిలోనే నిర్ణయం

సర్కారుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేం..హైకోర్టు

హైకోర్టులో సుదీర్ఘ కాలం సాగిన ఆర్టీసీ సమ్మె వ్యవహారం సోమవారంతో ముగిసింది. ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని, సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని హైకోర్టు కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో చర్చలు జరపాలని తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయని తెలిపింది. కమిటీ వేయటానికి కూడా ప్రభుత్వం అంగీకరించనందున తామేమీ చేయలేదని పేర్కొంది. సమ్మె విషయాన్ని కూడా కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని పేర్కొంది. కార్మిక శాఖ కమిషనర్ దగ్గర డిమాండ్ల అంశంపై తేల్చుకోవాలని సూచించింది. మరి హైకోర్టు ఆదేశాలపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే. అయితే సమ్మె విరుద్ధం అని ప్రకటించాలని కోరగా..అందుకు హైకోర్టు నిరాకరించించింది.

అయితే ఈ అధికారం ఎవరికి ఉందని ప్రశ్నించింది. హైకోర్టులో ప్రభుత్వం తరపున అడిషినల్‌ అడ్వొకేట్‌ జనరల్‌( ఏజీ) వాదనలు వినిపిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె చట్టవిరుద్ధమని కోర్టుకు వివరించారు. ‘పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌22(1)ఏ, ప్రొహిబిషన్‌ ఆఫ్‌ స్ట్రైక్‌ యాక్ట్‌ ప్రకారం సమ్మె ఇల్లీగల్‌. చట్టం ప్రకారం ఆరు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. సమ్మెకు కనీసం 14 ముందు ప్రభుత్వానికి తెలపాలి. కానీ కార్మికులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సెక్షన్‌ 24 ప్రకారం కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం’ అని ఏజీ హైకోర్టుకు వివరించారు.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను హైకోర్టుకు తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్పొరేషన్‌ పరిస్థితి అస్సలు బాగాలేదని, సమ్మె కారణంగా ఇప్పటి వరకు 44శాతం నష్టపోయినట్లు కోర్టుకు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. యూనియన్లు విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకుపెట్టినా, తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్‌ను తిసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందన్నారు. కొతంమంది యూనియన్‌ నేతలు తమ స్వార్థం కోసం టీఎస్‌ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించింది. సమ్మె అన్నది కార్మికుల కోసం కాకుండా, యూనియన్‌ నేతలు తమ ఉనికి చాటుకునేందుకు చేస్తున్నారని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.

Next Story
Share it