Telugu Gateway
Telangana

ఆగి ఉన్న ట్రైన్ ను గుద్దిన ఎంఎంటిఎస్ రైలు

ఆగి ఉన్న ట్రైన్ ను గుద్దిన ఎంఎంటిఎస్ రైలు
X

కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఊహించని ప్రమాదం. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును ఎంఎంటిఎస్ రైలు గుద్దేసింది. ఒకే ట్రాక్ పై ఈ రైళ్ళు ఎలా అనుమతించారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా తీవ్ర గాయాలు అయ్యాయి. కాచిగూడ స్టేషన్ కావటం..ఎంఎంటిఎస్ రైలు వేగం కూడా తక్కువగా ఉండటంతో పెనుప్రమాదం తప్పినట్లు అయింది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్నకొంగు ఎక్స్ ప్రెస్ ను వెనకనుంచి ఎంఎంటిఎస్ రైలు ఢీకొట్టింది.

సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే ఈ ప్రమాదానికి కారణం అయిందని అధికారులు చెబుతున్నారు. ఎంఎంటిఎస్ కు చెందిన మూడు కోచ్ లు ధ్వంసంగా..ఆరు కోచ్ లు మాత్రం పక్కకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంతో పలు రైళ్ళను దారి మళ్ళించటంతోపాటు..మరికొన్నింటిని రద్దు చేస్తున్నారు. దెబ్బతిన్న ట్రాక్ పనులను పునరుద్ధరించే పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Next Story
Share it