Telugu Gateway
Politics

ఉద్ధవ్ తో ఫోన్లో మాట్లాడిన పవార్

ఉద్ధవ్ తో ఫోన్లో మాట్లాడిన పవార్
X

బిజెపితో కలసి సర్కారు ఏర్పాటు చేయాలన్న అజిత్ పవార్ నిర్ణయానికి తమ మద్దతు లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. బిజెపితో అజిత్ పవార్ కలుస్తున్నారన్న విషయం కూడా తనకు తెలియదని ట్విట్టర్ వేదిక గా తెలిపారు. దీనికి పార్టీ ఆమోదం కూడా లేదన్నారు. అజిత్ పవార్ ది వ్యక్తిగత నిర్ణయం అని ..దాన్ని తాము సమర్ధించటం లేదని తెలిపారు. ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్ నిర్ణయం శరద్ పవార్ కు తెలియదని వ్యాఖ్యానించారు.

బిజెపితో కలసి ఎన్సీపీ ముందుకు సాగాలనే దానికి శరద్ పవార్ అనుమతి లేదన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ ఫోన్లో శివసేన అధినేత ఉద్థవ్ ఠాక్రేతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలపై అగ్రనేతలిద్దరూ చర్చలు జరిపారు. శివసేన కూడా శరద్ పవార్ కంటే అజిత్ ఫవార్ నే ఎక్కువ టార్గెట్ చేసింది.

Next Story
Share it