Telugu Gateway
Cinema

రాశీ ఖన్నా కీలక నిర్ణయం

రాశీ ఖన్నా కీలక నిర్ణయం
X

టాలీవుడ్ లో రాశీఖన్నా ఇఫ్పటికే చాలా సినిమాలు చేసింది. కానీ ఇఫ్పటివరకూ ఆమె గొంతు ఆమెది కాదు. ఎందుకంటే తెలుగు అంతగా రాదు కాబట్టి ఆమెకు డబ్బింగ్ చెప్పించేవారు. కానీ ఇఫ్పుడు రాశీఖన్నా మారిపోయింది. ఇక నుంచి ప్రేక్షకులు నా గొంతు వినండి. విని ఎలా ఉందో చెప్పండి అంటూ సొంతంగా డబ్బింగ్ కు రెడీ అయిపోయింది. అది ఏ సినిమాలో అంటారా? సెన్సేషనల్ హీరో విజయదేవరకొండ నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో రాశీఖన్నా సొంత గొంతు వినే అవకాశం రానుంది. ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్, ఇజాబెల్లే కథానాయికలుగా నటించారు. కేయస్‌ రామారావు సమర్పణలో కె.ఎ వల్లభ నిర్మించారు.

తెలుగులో తొలిసారి తన వాయిస్ విన్పిస్తున్న రాశీఖన్నా తాజాగా స్పందించింది. ‘‘నా పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకోవాలంటే నా గొంతు సరిగ్గా లేదేమోనని, పద ఉచ్చారణ లయ తప్పుతుందేమోనని కాస్త భయం ఉండేది. కానీ ఇప్పుడు డబ్బింగ్‌ చెబుతున్నాను. నా పాత్రబాగా వస్తోంది. నేనే ఆశ్చర్యపోతున్నా. ప్రేక్షకులకు నా గొంతు వినిపించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’’ అని చెప్పింది ఈ భామ.

Next Story
Share it