నితిన్..కీర్తిసురేష్ జోడీకట్టారు
BY Telugu Gateway8 Oct 2019 1:12 PM GMT
X
Telugu Gateway8 Oct 2019 1:12 PM GMT
‘రంగ్ దే’ సినిమా కోసం నితిన్, కీర్తి సురేష్ జోడీ కట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దసరాను పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ మంగళవారం నాడు ప్రారంభం అయింది. ఈ చిత్ర పూజా కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు దిల్ రాజు, చినబాబు తదితరులు పాల్గొన్నారు. నితిన్, కీర్తిలపై ముహుర్తపు షాట్ కు త్రివిక్రమ్ క్లాప్ కొట్టారు.
ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని..తమది ప్రేమతో కూడిన కుటుంబ కథాచిత్రం అని దర్శకుడు వెంకీ తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మజీ, అభినవ్ గోమటం ఇతర కీలకపాత్రలు పోషించనున్నారు.
Next Story