పులి..మూస్కోని పరిగెత్తమంది..!
పులి ఏంటి..మూస్కోని పరిగెత్తమనటం ఏంటి అనుకుంటున్నారా?. ఔను విజయదేవరకొండ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ పాటలోని చరణాలు ఇవి. ‘ఈ రోజు పొద్దున్నేపెద్ద పులి నన్నే ఎందుకో తరుముతోంది. అరె ఎందుకని తిరగి నేనడిగిగా.. పులి మూస్కోని పరిగెత్తమంది’అంటూ సాగే గీతాన్ని రాకేందు మౌళి రచించగా శివకుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సింగర్ రేవంత్ ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ ఈ చిత్రన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో భాగంగా మూవీ ప్రమోషన్స్ ను కూడా చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర దర్శకుడు షమ్మీర్ సుల్తాన్.
https://www.youtube.com/watch?v=eMGMlP5AEGE