Telugu Gateway
Telangana

అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు

అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు
X

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ఇదో కొత్త మలుపు. ఆర్టీసీ జెఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డిపై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 506, 341 సెక్షన్ కింద అశ్వత్థమారెడ్డి పై కూకట్ పల్లి పీఎస్ లో కేసు నమోదు అయింది. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. డ్రైవర్ రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయటంతో ఈ కేసు నమోదు చేశారు. ఆర్టీసి కార్మికులు అందరినీ అశ్వత్థామరెడ్డే విలీనం అనే విషం నింపుతున్నారని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 22 రోజులుగా చేస్తున్న సమ్మె వల్ల పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని రాజు తెలిపాడు. రాజు తన ఫిర్యాదులో ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి. ‘నేను కూకట్‌పల్లి డిపో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. సార్‌ మా యూనియన్‌ లీడర్ అశ్వత్థామరెడ్డి కార్మికుల మనసులో విలీనం అనే విషాన్ని నింపారు. ఆయన మాటలు నమ్మి 22 రోజులుగా జరుగతున్న ఆర్టీసీ సమ్మెలో కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వీరి ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డే ప్రధాన కారకుడు.

ఇక ముందు ఇలాంటివి జరగకూడదనే అశ్వత్థామరెడ్డి పై ఫిర్యాదు చేశాను. అంతేగాక ఒకప్పుడు ఆర్టీసీకి పెద్దన్నలా వ్యవహరించిన హరీష్‌ రావును కొందరు పనికిమాలిన వాళ్లు 'మీరు మౌనంగా ఉండొద్దు, నోరు విప్పాలి అంటూ' ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. హరీష్‌ రావుతో సమ్మె విషయం చర్చించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు చేస్తున్న సమ్మె వల్ల పోలీసుల సహాయం లేకుండా బస్సులు రోడ్డు మీదకు వెళ్లడం లేదు. మా చేతులతో మేమే ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నాం. గురువారం మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమ్మె మాట పక్కనబెట్టి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇది నిజంగా మనకు గొప్ప అవకాశం. మన ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దు. అశ్వత్థామరెడ్డి మీరు ఒక్కరే పీఎం, రాష్ట్రపతి వద్దకు వెళ్లి మా సమస్యలు పరిష్కరించండి. అంతేగానీ మా కార్మికుల పొట్ట గొట్టద్దు’ అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story
Share it