Telugu Gateway
Politics

ఏపీలో ఆర్టీసీ విలీనంపై కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఆర్టీసీ విలీనంపై కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తునట్లు ప్రకటించింది. ఈ అంశంపై తెలంగాణ సీఎం కెసీఆర్ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై మాట్లాడుతూ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు దేశంలో ఎక్కడా కూడా ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులు ఏపీ అంశాన్ని ప్రస్తావించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏమి జరిగింది. అక్కడ కమిటీ వేస్తూ ఓ జీవో ఇచ్చారు.

ఓ నాలుగైదు నెలలు ఆగండి అసలు విషయం తెలుస్తుంది. ఏమి అవుతుందో. మీకు తెలియదు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఏపీలో జగన్ సర్కారు ఏపీలోని ఆర్టీసి కార్మికులు అందరూ ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులే అని ప్రకటించింది. తెలంగాణ యూనియన్లు కూడా తమ డిమాండ్ కు ఏపీలో ఆర్టీసీ విలీనం అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ తరుణంలో కెసీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Next Story
Share it