Telugu Gateway
Telangana

మెఘా ఇంజనీరింగ్ కార్యాలయంలో ఐటి తనిఖీలు!

మెఘా ఇంజనీరింగ్ కార్యాలయంలో ఐటి తనిఖీలు!
X

మెఘా ఇంజనీరింగ్. ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ వివాదం తలెత్తినా తొలుత విన్పించే పేరు అదే. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ల వ్యవహారంలో ఈ సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేయటం..ఆ సర్కారు ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వటానికి రెడీ అయిపోవటం చకచకా సాగిపోయాయి. కోర్టులో కేసు ఉండటంతో ఇది కాస్తా పెండింగ్ లో పడింది. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసి సమ్మె విషయంలో కూడా రాజకీయ నేతలు మెఘాకు ముడిపెడుతున్నారు. ఆర్ టీసీని ప్రైవేట్ పరంగా చేసేందుకే సర్కారు కార్మికుల సమస్యలు పరిష్కరించటంలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పై ఐటి దాడుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఏకకాలంలో మేఘా కృష్ణారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. దేశ వ్యాప్తంగా 30 చోట్ల...హైదరాబాద్ లో నాలుగు చోట్ల సోదాలు. బాలానగర్ లోని కార్యాలయం , జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లోని కార్యాలయం లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.అయితేే ఐటి శాఖ మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Next Story
Share it