బండ్ల గణేష్ అరెస్ట్
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ను జూబ్లిహిల్స్ పోలీసుల అరెస్ట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ)ను ఆయన నివాసానికి వెళ్ళి రాత్రివేళ బెదిరించిన కేసులో బండ్ల గణేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్ల గణేశ్ పంపించారని ఈనెల 5న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో పీవీపీ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్ల గణేష్, అతడి అనుచరుడు కిశోర్పై ఐపీసీ సెక్షన్ 420, 448, 506, 109 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
బండ్ల గణేశ్ గతంలోనూ పలు కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరో కేసు అంశం కూడా తెరపైకి వచ్చింది. కడప జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు నాన్బెయిబుల్ వారెంట్ జారీ చేసింది. కడప జిల్లాకు చెందిన మహేష్ అని వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. తిరిగివ్వకపోవడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరుకాకపోవడంతో బండ్ల గణేశ్పై కోర్టు వారెంట్ జారీ చేసింది.