‘సైరా’ ట్రైలర్ వచ్చేసింది
చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సైరా నరసింహరెడ్డి’ సినిమా ట్రైలర్ రానేవచ్చింది. బుధవారం నాడు సాయంత్రం ఐమ్యాక్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. వాస్తవానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ తోపాటు ట్రైలర్ రిలీజ్ చేయాలని భావించినా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 22కి వాయిదా వేశారు. ఈ మూవీ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతోంది. ‘నరసింహారెడ్డి సామాన్యుడు కాదు అతడు కారణజన్ముడు’ అంటూ మొదలైన ట్రైలర్.. చివరి వరకూ యాక్షన్ సన్నివేశాలతో పందుపర్చారు.
‘ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము. మీకెందుకు కట్టాలిరా శిస్తు’, ‘స్వేచ్చ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భరతమాత గడ్డ మీద నిల్చొని హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ లు ట్రైలర్కు హైలెట్గా నిలిచాయి. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=KyhrrdpA2YA