‘సైరా’ సెకండ్ ట్రైలర్ వచ్చింది
ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార జోరు మరింత పెంచింది. ఈ సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులోనూ భారీ యాక్షన్ సన్నివేశాలను చూపించారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు ఈ సినిమాని.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన రావటంతో ఇప్పుడు మరో ట్రైలర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
https://www.youtube.com/watch?time_continue=3&v=tpriCP8dlBY