Telugu Gateway
Politics

సెక్స్ రాకెట్ షాక్ లో మాజీ సీఎం..ఐఏఎస్ లు!

సెక్స్ రాకెట్ షాక్ లో మాజీ సీఎం..ఐఏఎస్ లు!
X

ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు సెక్స్ రాకెట్ కుంభకోణం వణికిస్తోంది. ఇందులో ఏకంగా మాజీ సీఎంతోపాటు మాజీ గవర్నర్, ఇతర రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్ లు చిక్కుకోవటం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో అన్న భయంతో నేతలు హడలిపోతున్నారు. ఇది అంతా ఎక్కడ అంటారా?. మధ్యప్రదేశ్ లో. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సెక్సా రాకెట్ కు సంబంధించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ రాకెట్‌లో బాలీవుడ్‌కు చెందిన కొంతమంది బీ-గ్రేడ్ హీరోయిన్‌లతో సహా 40 మందికి పైగా కాల్ గర్ల్స్ ప్రైవేట్‌ వీడియోలు చూపించి బ్లాక్ మెయిలింగ్‌ రాజకీయాలకు తెరలేపినట్లు వెల్లడవుతోంది. అయితే వీడియో క్లిప్‌లను ఫోరెన్సిక్ విభాగం పరిశీలించిన తరువాత వ్యవస్థీకృతంగా వేళ్లూనుకొనిపోయిన బ్లాక్ మెయిలింగ్‌ వ్యవస్థను, వ్యక్తులను గుర్తిస్తామని కేసును విచారిస్తున్నసిట్ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన బ్లాక్ మెయిలింగ్ కుంభకోణం ఉచ్చులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్‌తో సహా పలువురు ప్రముఖులు చిక్కుకుపోవడం మరింత దుమారం రేపుతోంది.

బ్యూరోక్రాట్లు, రాజకీయనాయకులను అభ్యంతకర భంగిమల్లో ఉన్నప్పుడు చిత్రీకరించిన 92 హైక్వాలిటీ వీడియో క్లిప్‌లుర ప్రస్తుతం పోలీసు అధికారుల చేతికందాయి. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్‌ చేసి, రెండు ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. సెక్స్ కుంభకోణంలో బీజేపీ నాయకులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధిస్తోందని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా డిమాండ్‌ చేయటం విశేషం. ఈ ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఈ కేసును విచారిస్తున్న సిట్‌కు (ప్రత్యేక దర్యాప్తు బృందం) నేతృత్వం వహిస్తున్న డి. శ్రీనివాస్‌ను తప్పించి ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. బ్యూరోక్రాట్లు, పలు ప్రముఖ రాజకీయ నాయకుల హనీట్రాప్‌నకు సూత్రధారిగా వ్యవహరించిన శ్వేతా స్వాప్నిల్ జైన్‌ను సిట్ అరెస్టు చేసింది. అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. శ్వేతా తాను లక్ష్యంగా చేసుకొన్న ఒక బ్యూరోక్రాట్ లేదా మంత్రిని గెస్ట్ హౌస్ లేదా తాను ఎంపిక చేసుకొన్న ఫైవ్ స్టార్ హోటల్‌కు ఆహ్వానించేది. సదరు టార్గెట్‌ అధికారిక పర్యటనల నిమిత్తం ముంబయ్, ఢిల్లీ వెళితే.. వారి డిమాండ్ మేరకు టాప్‌ మోడల్స్, కాల్‌గర్ల్స్‌, బాలీవుడ్ నటీమణులను ఎరవేసేది. ఒకసారి' టార్గెట్' శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియోను చిత్రీకరించేవారు. తర్వాత వాటిని చూపి సదరు వ్యక్తులను బ్లాక్‌మెయిల్‌ చేసేవారు.

తన భర్త స్వాప్నిల్ జైన్ నిర్వహిస్తున్న ఓ ఎన్జీవో కోసం నిధులు సేకరించే క్రమంలో పలువురుని హనీట్రాప్‌లోకి లాగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త నుంచి ఐదు హార్డ్ డిస్కులను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణంలో భాగంగా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం తనకు భోపాల్‌లోని ఖరీదైన ప్రాంతమైన మినల్ రెసిడెన్సీలో ఒక బంగ్లా బహుమతిగా ఇచ్చినట్లు శ్వేతా అంగీకరించారు. శ్వేతా జైన్‌తో పాటు, మరో మహిళ ఆర్తీ దయాల్ కూడా ఐఏఎస్ అధికారి నుంచి గిఫ్ట్‌ గా భోపాల్‌లో ఒక ఫ్లాట్ పొందానని అంగీకరించారు. సెక్స్ రాకెట్‌లో మాజీ మంత్రులు, బ్యూరోక్రాట్ల ప్రమేయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్, ఇండోర్‌ వంటి ప్రముఖ పట్టణాల్లో సెక్స్‌ రాకెట్‌ చాలా సంవత్సరాలుగా సాగుతోందని, బ్లాక్ మెయిల్‌కు గురైన రాజకీయ నాయకులలో 80 శాతం మంది బీజేపీకి చెందినవారేనని అభిప్రాయపడ్డారు. అందులో ఎవరు ఉన్నా చర్యలు తప్పవని తెలపారు.

Next Story
Share it