Telugu Gateway
Andhra Pradesh

ఏపీ డీజీపికి చంద్రబాబు లేఖ

ఏపీ డీజీపికి చంద్రబాబు లేఖ
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. ఏపీ పోలీసుకు దేశంలోనే మంచి పేరు ఉందని..ఆ పేరు చెడగొడవద్దంటూ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ నేతలు ఏమి చెపితే అదే పోలీసులు పాటిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయంటూ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వాక్ స్వాత్రంత్రం హరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని పేర్కొన్నారు.

ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాల రాస్తుందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రజలు, మీడియా ప్రతినిధులపై వరుస దాడులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రతినిధులు సంఘ విద్రోహ శక్తుల ద్వారా శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని చంద్రబాబు లేఖలో వివరించారు. చీరాలలో ఆమంచి వర్గీయులు విలేకరిపై దాడి చేసినా ఇంకా చర్యలు తీసుకోలేదని డీజీపీకి లేఖలో తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it