Telugu Gateway
Politics

టీడీపీకి మరో షాక్

టీడీపీకి మరో షాక్
X

తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూలేని రీతిలో రాజకీయంగా ఎదురీదుతోంది. పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా..తాజాగా మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి ఎదురుదెబ్బ తగలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా గురువారం రాజీనామా చేశారు. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని, ఈ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పేదల అవసరాలను గుర్తించడంలో టీడీపీ వైఫ్యలం చెందిందని అన్నారు.

కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదని వాపోయారు. టీడీపీ పూర్తిగా వెనుకబడిపోయిందని, టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కాపులకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. టీడీపీలో ఉన్న 80 శాతం కాపు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కాపులను చంద్రబాబు పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కాపుల విషయంలో సీఎం వైఎస్‌ జగన్ మొదటి నుంచీ ఒకే విధానంతో ఉన్నారని అన్నారు. ఆయన జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పరిస్థితి చూస్తుంటే ఆయన అదికార పార్టీలో చేరటం ఖాయంగా కన్పిస్తోందని చెబుతున్నారు.

Next Story
Share it