కొండారెడ్డి బురుజు సెట్ లో మహేష్ బాబు
BY Telugu Gateway26 Aug 2019 3:38 AM GMT
X
Telugu Gateway26 Aug 2019 3:38 AM GMT
కొండారెడ్డి బురుజుకు..సూపర్ స్టార్ మహేష్ బాబుకు మధ్య లింక్ ఉంది. ఈ బురుజు వేదికగా ఒక్కడు సినిమాలో ఆయన నటించిన సీన్లు హైలెట్ గా నిలిచాయి. సినిమా కూడా అప్పట్లో హిట్ అయింది. ఇఫ్పుడు హైదరాబాద్ లో భారీ వ్యయంతో ఈ బురుజు సెట్ వేసి మరీ షూటింగ్ చేస్తున్నారు. దీంతో మరోసారి తమ హీరో హిట్ కొట్టడం ఖాయం అనే అభిప్రాయంతో మహేష్ బాబు అభిమానులు ఉన్నారు.
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ కోసం ఈ సెట్ వేశారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేశ్బాబు నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, మహేశ్బాబు మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తుండటం ఓ విశేషం.. చాలా గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ మేకప్ వేసుకున్నారు.
Next Story