కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
BY Telugu Gateway22 Aug 2019 6:04 AM GMT
X
Telugu Gateway22 Aug 2019 6:04 AM GMT
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నుంచి తరలిపోనుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఆయన తాజాగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. అదేంటో చూడండి.
‘జగన్ రెడ్డి గారు @ysjagan చిన్నపుడు మొహ్మద్ బీన్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాం. 1328 సంవత్సరంలో ఢిల్లీ నుంచి రాజధాని మహారాష్ట్ర లోని దౌలతాబాద్కు తిరిగి అక్కడి నుండి ఢిల్లీ కి మార్చిన వైనం. మీరు ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకూడదని భగవంతుని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.
Next Story