డీశాలినేషన్ ప్లాంట్ ను సందర్శించిన జగన్

వ్యక్తిగత పర్యటన కోసం జెరూసలెం వెళ్ళిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరస పెట్టి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సాగు పద్దతులు తెలుసుకున్న జగన్..ఆదివారం నాడు అక్కడ ఉన్న డీశాలినేసన్ ప్లాంట్ ను పరిశీలించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేదే డీశాలినేషన్ ప్లాంట్. అలా శుద్ధి చేసిన నీటిని కూడా జగన్ తాగి చూశారు. ఆయన ఇజ్రాయెల్ ఉన్న హదెరా నీటిశుద్ధి ప్లాంట్ను సందర్శించారు. ప్రాజెక్టు వ్యయం, నిర్వహణా వ్యయాల గురించి సీఎం అక్కడి అధికారులను ఆరా తీశారు.
ప్లాంట్లో వివిధ విభాగాలను పరిశీలించిన సీఎం ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియలో పలు దశల గురించి అడిగి తెలుసుకున్నారు. యంత్రాల పనితీరును పరిశీలించి ప్లాంట్లో మంచినీటిని రుచి చూసిన ముఖ్యమంత్రి నీటి నాణ్యత మెరుగ్గా ఉందని ప్రశంసించారు. టెల్అవీవ్లో బారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ సీఎం వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు