Telugu Gateway
Politics

గుత్తాకే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఛాన్స్

గుత్తాకే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఛాన్స్
X

సీనియర్ నేత, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం నాడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఎన్నికల కోటా కింద ఈ ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ కు దక్కనుంది. టీఆర్ఎస్ తరపున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను కెసీఆర్ కోరారు. వాస్తవానికి ఎప్పటి నుంచో గుత్తాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారంలో ఉన్నా రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ వస్తోంది. చివరకు ఇప్పుడు గుత్తాకు ఛాన్స్ దక్కింది. ఎమ్మెల్సీ అయి ఎలాగైనా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్నది గుత్తా ఆలోచన.గుత్తా శనివారం ఉదయం సీఎం కెసీఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు.

ఎప్పటి నుంచో ఆయన మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అయితే వస్తోంది..మరి గుత్తా మంత్రి అవుతారా? కారా అన్నది సంగతి కొంత కాలం పోతే కానీ తెలియదు. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అధినేత కెసీఆర్ దగ్గర నుంచి మాత్రం ఎవరికీ ఎలాంటి స్పష్టమైన సంకేతాలు మాత్రం లేవని చెబుతున్నారు. ఈ సారి విస్తరణలో మాజీ మంత్రులు కెటీఆర్, హరీష్ రావులకు బెర్త్ ఖాయం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it