Telugu Gateway
Politics

చంద్రబాబుకు ఇంకా అర్ధం కావటంలేదట!

చంద్రబాబుకు ఇంకా అర్ధం కావటంలేదట!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి ఇంకా అర్ధం కావటంలేదట. అంతు చిక్కటం లేదట. తన ఓటమికి కారణం ఏంటో తెలియటం లేదని వాపోతున్నారు. ప్రజలకు ఎంతో చేసినా కూడా మరీ 23 సీట్లలోనే గెలిపిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ పార్టీకి చెందిన ఏ నాయకుడిని అడిగినా గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఓ వంద కారణాలు చెబుతారు?. కానీ ఇంకా ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారు. బుధవారం నాడు వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన నేతలతో చంద్రబాబు ఏదేదో మాట్లాడేశారు. ‘పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు వంటి ప్రభుత్వాన్ని కోరుకున్నారు.

ప్రజలకు కష్టం తెలియకుండా నేనే కష్టపడ్డా. సంక్షేమ పథకాల్లో లోటు రానివ్వలేదు. ప్రపంచ స్థాయి రాజధానికి శ్రీకారం చుట్టా. అతి తక్కువ సమయంలో పట్టిసీమ పూర్తి చేశాం. పట్టిసీమ నీళ్లు తాగి కూడా నాకు ఓట్లు వేయలేదు. ఢిల్లీకి వెళ్లిన జగన్ పోలవరం, అమరావతికి సాయం అడగాల్సింది పోయి తనపై ఫిర్యాదు చేస్తారా? అని ప్రశ్నించారు. నేనేమైనా తప్పులు చేశానా?. టీడీపీ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి దుర్మార్గాలు జరిగాయా? అంటూ ప్రశ్నించారు. రెండు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వ బండారం బయటపడిందని వ్యాఖ్యానించారు. ఇసుకపై సకాలంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఏపీలో 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు.

Next Story
Share it