Telugu Gateway
Politics

యూఏఈ రాణి పరార్..240 కోట్లతో జంప్

యూఏఈ రాణి పరార్..240 కోట్లతో జంప్
X

రాణి ఏంటి?. పారిపోవటం ఏమిటి అనుకుంటున్నారా?. కానీ ఇది నిజమే. అందులోని అత్యంత కఠిన చ ట్టాలు ఉండే దుబాయ్ కు చెందిన రాజు భార్య భారతీయ కరెన్సీలో 240 కోట్ల రూపాయల విలువైన నగదు, తన పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరో భార్య, దుబాయ్ రాణి అయిన హయా బింత్ అల్ హుస్సేన్ ఇద్దరు పిల్లలతో దేశం విడిచిపోయారు.

ఆమె ప్రస్తుతం లండన్ లో ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. తొలుత జర్మనీ వెళ్ళిన ఆమె..అక్కడ నుంచి లండన్ చేరుకున్నట్లు సమాచారం. ఆమె తన భర్త నుంచి విడాకులు కోరుతున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం పలు దేశాల మద్య వివాదాలే రేపేలా కన్పిస్తోంది. తన భార్యను వెనక్కి పంపాలని షేక్ మహ్మద్ జర్మనీ ని కోరగా..అక్కడి అధికారులు తిరస్కరించినట్లు సమాచారం. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న రాణి మే 20 నుంచి కన్పించటంలేదని సమాచారం.

Next Story
Share it