Telugu Gateway
Cinema

‘సాహో’ ఫినిషింగ్ టచ్ ఇది

‘సాహో’ ఫినిషింగ్ టచ్ ఇది
X

సరిగ్గా మరో నెల రోజుల్లో ‘సాహో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం తో పూర్తయింది. దీంతో చిత్ర బృందంతో హీరో ప్రభాస్ సెల్ఫీలు దిగారు. అంతే కాదు..చిత్ర యూనిట్ అంతా కలసి పార్టీ చేసుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.

2017 జూన్ 9న ప్రారంభం అయిన ఈ సినిమా 2019 జూలై 15న పూర్తయింది. భారీ భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమా నిర్మాణానికి అతి ఎక్కువ సమయం పట్టింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Next Story
Share it