విమానాశ్రయంలో చిక్కుకుపోయిన రకుల్
BY Telugu Gateway2 July 2019 11:42 AM IST

X
Telugu Gateway2 July 2019 11:42 AM IST
ముంబయ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముంబయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. కారణం సోమవారం రాత్రి నుంచి ముంబయ్ విమానాశ్రయం నుంచి ఒక్క విమానం కూడా టేకాఫ్ కాలేదంట. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారీ వర్షాల దెబ్బకు రన్ వే పై నీరు చేరగా..పలు విమానాలను దారి మళ్ళించారు.
మరికొన్ని మాత్రం విపరీతమైన జాప్యంతో నడుస్తున్నాయి. ఇప్పటికే వర్షాలకు ముంబయ్ వణుకుంటే జూలై 5 నుంచి మరింత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అసలు ముంబయ్ విమానాశ్రయం తెరిచి ఉందో లేదో చెప్పాలంటూ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయగా..రకుల్ ముంబయ్ విమానాశ్రయంలో పరిస్థితిని వివరించారు.
Next Story