మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతి
BY Telugu Gateway29 July 2019 10:00 AM GMT
X
Telugu Gateway29 July 2019 10:00 AM GMT
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోమవారం నాడు మరణించారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎం.ముఖేశ్ గౌడ్ వయస్సు 60 సంవత్సరాలు. ముఖేష్ గౌడ్ కేన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న ముఖేష్ గౌడ్ సోమవారం మధ్యాహ్నం మరణించారు. ముఖేష్ గౌడ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ కేబినెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత మార్కెటింగ్ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగినా బిజెపికి చెందిన రాజాసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
Next Story