‘మన్మథుడు 2’ ట్రైలర్ వచ్చేసింది
‘అద్భుతం..అమోఘం. ఇటువంటి పథకం మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా వేయలేదు. నేను పిల్లలను కనను. నా జీవితం మాత్రమే నా బాద్యత.’ ఇవీ నాగార్జున డైలాగ్ లు. మన్మథుడు 2 చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను గురువారం నాడు విడుదల చేసింది. ఈ ట్రైలర్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావూ రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్తో కలిసి నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు ఓ ప్రత్యేక పాత్రలో కీర్తి సురేష్ కూడా సందడి చేయనుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
https://www.youtube.com/watch?time_continue=8&v=4hClf9HRlpk