Telugu Gateway
Cinema

స్పెయిన్ లో కీర్తి సురేష్ హంగామా

స్పెయిన్ లో కీర్తి సురేష్ హంగామా
X

కీర్తిసురేష్ స్పీడ్ పెంచారు. మహానటి సినిమా తర్వాత ఆమె కాస్త స్లో అయినట్లు అన్పించినా మళ్లీ ఇప్పుడు దూకుడు చూపిస్తున్నారు. ఆమె ప్రస్తుతం తెలుగులో మన్మథుడు2లో ఓ కీలక పాత్ర చేయటంతోపాటు..నితిన్ తో కలసి ‘రంగ్ దే’ అననున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ స్పెయిన్ లో షూటింగ్ చేస్తున్నారు. ఓ వైపు తెలుగులో సినిమాలు చేస్తూనే కోలీవుడ్ లోనూ ఆమె తన సత్తా చాటుకుంటున్నారు. మరో ఇరవై రోజులు స్పెయిన్‌లోనే గడపనున్నారు కీర్తీ సురేశ్‌. ఈ నెలాఖరకు గానీ ఆమె ఇండియా రారని చెబుతున్నారు. నూతన దర్శకుడు నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో కీర్తీ సురేశ్‌ ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేస్తున్నారు.

జూన్‌ 11న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను స్పెయిన్‌లో స్టార్ట్‌ చేశారు. ఈ షెడ్యూల్‌ జూలై 26 వరకూ సాగనుందని సమాచారం. ఇటీవలే నదియా, కీర్తీ సురేశ్‌లపై కీలక సన్నివేశాలను షూట్‌ చేశారు. నదియా పాత్ర చిత్రీకరణ పూర్తయింది. స్పెయిన్‌ షెడ్యూల్‌తో ఈ సినిమా దాదాపు 90 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకోనుందని తెలిసింది. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. మహేశ్‌ కోనేరు నిర్మాత. ‘మహానటి’ ఫేమ్‌ డ్యానీ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు.

Next Story
Share it