Telugu Gateway
Andhra Pradesh

ఇది ‘ఓ రికార్డు’ అంటున్న జగన్

ఇది ‘ఓ రికార్డు’ అంటున్న జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఓ ట్వీట్ చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి..ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించబోతోందని పేర్కొన్నారు.

ఈ వ్యవస్థ ద్వారా ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు అని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదబలం వల్లే ఇది సాధ్యమవుతోందని అన్నారు.

Next Story
Share it